తాండూరు పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు జావీద్, చాంద్ ఆధ్వర్యంలో 50 మంది పార్టీ కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అనంతరం వారు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో రంజిత్ రెడ్డి విజయానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు హబీబ్ లాల, జడ్పీటీసీ ధారాసింగ్, నాయకులు పాల్గొన్నారు.