సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా నేడు నాలుగో విడత పోలింగ్ జరుగుతోంది. అయితే పశ్చిమ బెంగాల్లోని బోల్పుర్ లోక్సభ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు బాంబులు విసురుకున్నారు. ఈ ఘటనలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు.