ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. భారత్లో టీ20ల్లో 9,000 పరుగులకు పైగా చేసిన తొలి ఇండియన్ ప్లేయర్గా ఆయన చరిత్ర సృష్టించారు. సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో కోహ్లీ ఈ ఘనత సాధించారు. అలాగే ఐపీఎల్లో రెండు సార్లు 700కుపైగా రన్స్ చేసిన రెండో ప్లేయర్గా రికార్డులకెక్కారు. గతంలో క్రిస్ గేల్ కూడా 2 సార్లు 700కుపైగా రన్స్ సాధించారు.