కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించారు. శనివారం జీటీపై 42 రన్స్ చేసిన ఆయన.. పొట్టి క్రికెట్లో 12,500 రన్స్ మార్క్ చేరుకున్న తొలి భారత ఆటగాడిగా, ఓవరాల్గా నాలుగో ప్లేయర్గా నిలిచారు. తొలి 3 స్థానాల్లో గేల్(14,562), షోయబ్(13,360), పొలార్డ్(12,900) ఉన్నారు. అలాగే ఐపీఎల్లో గెలిచిన మ్యాచ్లలో అత్యధిక రన్స్(4,039) చేసిన ప్లేయర్గా ఘనత సాధించారు. ఆ తర్వాత ధవన్(3,945), రోహిత్(3,918), వార్నర్(3,710) ఉన్నారు.