చంద్రబాబుకు ఇవ్వం.. వాళ్లకే ఇస్తాం: వైసీపీ

76చూసినవారు
చంద్రబాబుకు ఇవ్వం.. వాళ్లకే ఇస్తాం: వైసీపీ
విజయవాడ వరద బాధితుల కోసం వైసీపీ తరఫున కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు గతంలో మాజీ సీఎం జగన్ ప్రకటించారు. అంత కాదు ఈ మొత్తం ఎలా అందించాలో త్వరలో నిర్ణయిస్తామన్నారు. ఇప్పుడు దానిపై శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టత ఇచ్చారు. విజయవాడ వరద బాధితుల కోసం తాము అందించే సాయాన్ని నేరుగానే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజలకు నేరుగా మేమే సహాయం అందిస్తున్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వాల్సిన అవసరం ఏముందని బొత్స ప్రశ్నించారు

సంబంధిత పోస్ట్