ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశారు. కింగ్ విరాట్ కోహ్లీ 111 బంతుల్లో సెంచరీ చేశారు. 42వ ఓవర్లో ఖుల్దిష్ షా వేసిన మూడో బంతిని బౌండరీగా బాది భారత్కు విజయాన్ని అందించడంతో పాటు సెంచరీ కూడా పూర్తి చేసుకున్నారు. విరాట్ కోహ్లీకి ఇది 51వ సెంచరీ. 82వ ఇంటర్నేషనల్ సెంచరీ, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీకి ఇదే మొదటి సెంచరీ.