మధ్యప్రదేశ్లోని అనుప్పుర్లో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. విశాఖపట్నం-అమృత్సర్ హిరాకుడ్ ఎక్స్ప్రెస్ రైలును వేగంగా దూసుకొచ్చి ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలు కోచ్లు దెబ్బతిన్నాయి. మూసి ఉన్న రైల్వే క్రాసింగ్ను ఢీకొట్టి మరీ కారు ముందుకు దూసుకొచ్చిందని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.