హోటల్‌లో రూ.4 కోట్లు పట్టివేత

4477చూసినవారు
హోటల్‌లో రూ.4 కోట్లు పట్టివేత
చెన్నై తాంబరం వద్ద ఎలక్షన్ ఫ్లయింగ్ ట్రూపర్ అధికారులు ఆదివారం దాడులు చేశారు. సుమారు రూ.4 కోట్లు పట్టుకున్నారు. కిల్‌పాక్‌లోని నయనార్ నాగేంద్రన్‌కు చెందిన బ్లూ డైమండ్ హోటల్‌లో సోదాలు జరిపారు. దీంతో భారీగా డబ్బు పట్టుబడింది. ఫ్లయింగ్ ట్రూపర్లు హోటల్‌లోని అన్ని గదులను తనిఖీ చేస్తున్నారు. పట్టుబడిన ముగ్గురిలో పెరుమాళ్ అనే వ్యక్తి బీజేపీ అభ్యర్థి నయనార్ నాగేంద్రన్ బంధువుగా తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్