Apr 20, 2024, 17:04 IST/జనగాం
జనగాం
ఏప్రిల్ 27న పూలే అంబేద్కర్ జన జాతర
Apr 20, 2024, 17:04 IST
ఏప్రిల్ 27 వ తేదీన పూలే అంబేద్కర్
జన జాతర పేరుతో జనగామ జిల్లా సదస్సును
సామాజిక సంఘాల ఐక్యవేదిక ఆద్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి యండి అబ్బాస్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రమైన జనగాం నగరంలోని సామాజిక సంఘాల ఐక్య వేదిక కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 27న పూలే అంబేద్కర్
జన జాతర కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సాంబరాజు యాదగిరి, అహల్య లు పాల్గొన్నారు.