తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన- అభయహస్తం పేరిట 5 గ్యారెంటీలకి సంబంధించి ప్రజల నుంచి ఇప్పటికే దరఖాస్తులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని ఎంపిడివో కార్యాలయంలో డేటా ఎంట్రీ శరవేగంగా సాగుతుంది. మండలంలోని అన్ని గ్రామాల ప్రజల నుంచి తీసుకున్న దరఖాస్తుల వివరాల ఆన్ లైన్ నమోదు కోసం ఆపరేటర్లు నిరంతరంగా శ్రమిస్తున్నారు.