మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలించేందుకు వెళుతున్న రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యుల బృందం జనగామ జిల్లా పెంబర్తి కళాతోరణం దాటి హన్మకొండ వైపు ప్రయాణించింది. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ పెంబర్తి కళాతోరణం దాటుతుండగా పలువురు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు.