నీళ్లు అందక ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. ఆదివారం జనగాం జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో ఈ సందర్భంగా పంటను కోల్పోయిన ఆంగోతు సత్తెమ్మ కేసీఆర్ ముందు తన కొడుకు పెళ్లి పెట్టుకున్నానని చేతిలో చెల్లి గవ్వలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో తక్షణమే స్పందించిన కేసీఆర్ సత్యమ్మ కుమారుని వివాహ ఖర్చు నిమిత్తం ఐదు లక్షల రూపాయలను అక్కడికక్కడే ప్రకటించారు.