మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో శుక్రవారం రాత్రి ఒకేసారి వాతావరం మార్పులు జరిగి ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో మిరప సాగుచేసిన కల్లాలలో ఆరబోసిన మిర్చి తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తడిసిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరో వైపు వర్షంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.