తాను నిర్మించిన జూనియర్ కళాశాల భవనానికి బిల్లులు చెల్లించడం లేదంటూ ఓ కాంట్రాక్టర్ సోమవారం కళాశాలలోకి ఎవరూ వెళ్లకుండా ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళ్తే గత ప్రభుత్వంలో మనఊరు మన బడి పథకంలో భాగంగా నూగూరు వెంకటాపురంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఓ కాంట్రాక్టర్ నిర్మించాడు. రూ. కోటికి పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఏడాది గడుస్తున్న అధికారులు చెల్లించకపోవడంతో ముళ్లకంచె వేసి షాక్ ఇచ్చాడు.