ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: మహేందర్ జీ

76చూసినవారు
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: మహేందర్ జీ
సీఎంఆర్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ అన్నారు. కలెక్టరేట్ లో మిల్లర్ల యజమానులతో సోమవారం సమావేశం నిర్వహించారు. సందర్భంగా మహేందర్ జీ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు, ఎగుమతులు, దిగుమతులు, సీఎంఆర్ ధాన్యం విషయంలో మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్