రాష్ట్రాలకు పన్నులు పంపిణీ చేసిన కేంద్రం

21452చూసినవారు
రాష్ట్రాలకు పన్నులు పంపిణీ చేసిన కేంద్రం
రూ.1,39,750 కోట్ల పన్నులను కేంద్రం రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఇందులో ఏపీకి రూ. 5655.72 కోట్లు, తెలంగాణ‌కు రూ. 2937.58 కోట్లు మంజూర‌య్యాయి. అత్య‌ధికంగా యూపీకి రూ.25,066.88 కోట్లు, బిహార్‌కు రూ.14056.12 కోట్లు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు రూ.10,970.44 కోట్లు, ప‌. బెంగాల్‌కు రూ.10,513.72 కోట్లు విడుద‌ల‌య్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఇప్పటివరకు రూ.2,79,500 కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్ల‌డించింది.

సంబంధిత పోస్ట్