నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలి

53చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న వరి పంటను బుధవారం ఎం సిపిఐ(యు), అఖిలభారత రైతు సమైక్య నాయకులు పరిశీలించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి, మొక్కజొన్న, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్