కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ వర్ధంతి వేడుకలు

1842చూసినవారు
కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ వర్ధంతి వేడుకలు
బూర్జువా భూస్వామ్య పెట్టుబడిదారీ పార్టీల దోపిడి విధానాలను ఎండగట్టి, సమసమాజం కోసం మార్క్సిజాన్ని పుణికిపుచ్చుకొని అనేక ఆటుపోట్లను ఎదుర్కొని శ్రమ జీవుల పక్షాన రాజీలేని పోరాటాన్ని కొనసాగించిన మార్క్సిస్టు యోధుడు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ అని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యులు వంగల రాగసుధ అన్నారు. ఆదివారం అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 13వ వర్ధంతి సందర్భంగా స్థానిక నల్లబెల్లి మండల కేంద్రంలో ప్రస్తుత రాజకీయాలు వామపక్ష సామాజిక శక్తుల ఐక్యత అనే అంశంపై సమావేశం ఏఐఎఫ్డిఎస్ డివిజన్ కార్యదర్శి మార్త నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి దామ సాంబయ్య, ఏఐకెఎఫ్ డివిజన్ నాయకుడు బోళ్ల సుదర్శన్, ఏఐఎఫ్ డిడబ్ల్యూ మండల అధ్యక్ష కార్యదర్శులు మాట్ల సుధా, కోడూరు శోభలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్