గీతకార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే

53చూసినవారు
గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 199 మంది కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్టులను ఎమ్మెల్యే శుక్రవారం అందజేశారు. కాటమయ్య కిట్లను గీత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పుష్పలత, ఎక్సైజ్ డీఎస్పీ మురళీధర్, సీఐ నరేష్ రెడ్డి తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్