శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే చల్లా

51చూసినవారు
మహాశివరాత్రి పురస్కరించుకొని పరకాల పట్టణంలో ప్రసిద్దిగాంచిన శ్రీ కుంకుమేశ్వర ఆలయంలో స్వామి వారిని కుటుంబ సమేతంగా పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ పరమశివుని ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్