Apr 02, 2025, 09:04 IST/వరంగల్ (వెస్ట్)
వరంగల్ (వెస్ట్)
శ్రీ భద్రకాళి అమ్మవారికి లక్ష మల్లెపూలతో అర్చన
Apr 02, 2025, 09:04 IST
వసంత నవరాత్రి మహోత్సవముల సందర్భంగా బుధవారం శ్రీ భద్రకాళి అమ్మవారికి లక్ష మల్లెపూలతో అర్చన చేశారు. వరంగల్ నగరంలో భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి వసంత నవరాత్రి మహోత్సవం ఘనంగా జరుగుతున్నాయి. నాల్గవ రోజు అమ్మవారికి లక్ష మల్లెపూలతో అర్చన చేశారు. మల్లెపూలతో ఆ అమ్మవారికి అర్చన చేస్తే ప్రశాంతమైన జీవితం గడుపుతారని అర్చకులు తెలిపారు