జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రానికి చెందిన చేవెళ్ల రాములు(55) అదృశ్యమైనట్లు సిఐ ముస్కరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29న గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి వస్తానని రాములు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో కుమారుడు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.