మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

82చూసినవారు
హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో కొలువై ఉన్న గట్టు మల్లికార్జున స్వామి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకుని ఆ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా స్వామివారికి పట్నాలు సమర్పించారు. అనంతరం ఆ స్వామి వారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్