47 ఏళ్ల వయసులో పరుగు పోటీల్లో పాల్గొంటున్న తెలంగాణ మహిళా వ్యవసాయ కూలీ

1090చూసినవారు
47 ఏళ్ల వయసులో పరుగు పోటీల్లో పాల్గొంటున్న తెలంగాణ మహిళా వ్యవసాయ కూలీ
కుమురం భీం జిల్లా బురుగూడకు చెందిన 47 ఏళ్ల వ్యవసాయ కూలీ శకుంతల గత 4 ఏళ్లుగా పరుగు పోటీల్లో పాల్గొంటున్నారు. గతేడాది జాతీయ స్థాయి నడక పోటీల్లో రజతం, రాష్ట్ర స్థాయి 5 కిమీ పరుగులో స్వర్ణం సాధించారు. "మొదట్లో అందరూ ఈ వయసులో ఎందుకమ్మా నీకు పోటీలు, పరుగులు అనేవారు. అయినా నేను పట్టించుకోలేదు." అని శకుంతల చెప్పారు. శకుంతల భర్త 60 ఏళ్ల ఆనందరావు కూడా పరుగు పోటీల్లో పాల్గొంటారు. వీరికి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్