వరంగల్ నగరంలో మద్యం తాగి వాహనం నడిపిన కేసులో 28 మంది వాహనదారులకు జరిమానా, ఇద్దరు ఇద్దరు వాహనదారులకు జైలుశిక్షను వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గుర్రపు వీరస్వామి విధించినట్టు వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ గురువారం సాయంత్రం తెలిపారు. ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డ 28 మంది వాహనదారులకు రూ. 33, 500 జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ లేని 10మంది వాహనదారులకు రూ. 11, 800 జరిమానా విధించినట్లు తెలిపారు.