పలు క్లినిక్ లను తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ బృందం

66చూసినవారు
పలు క్లినిక్ లను తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ బృందం
అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు క్లినిక్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టము 2010 లో పేర్కొన్న నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నాల్గవ జోన్ టాస్క్ ఫోర్స్ బృందాధికారి డాక్టర్. వి. రాజశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన బృంద సభ్యులతో కలిసి హనుమకొండలోని పలు ఆసుపత్రులు క్లినిక్లను తనిఖీ చేశారు. ప్రతి హాస్పిటల్ యాజమాన్యం తాము అందిస్తున్న సేవల వివరాలు, ధరల పట్టికను అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించాలన్నారు.

సంబంధిత పోస్ట్