వరంగల్ బల్దియా కార్యాలయం ముందు భక్తులకు, వినాయకుడి తయారీదారులకు మధ్య శుక్రవారం ఘర్షణ జరిగింది. వినాయకుడిని కొనుగోలు చేసిన భక్తులు క్రేన్ సహాయంతో వాహనంలో తరలిస్తుండగ గణనాథుడు పగిలి పోయాడు. దీంతో నాసిరకం వినాయకుడిని అప్పగించారని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న మట్టేవాడ పోలీసులు చేరుకొని సర్దిచెప్పి పంపారు.