బేకరిలో ఎగ్ పఫ్ తిని అస్వస్థత

62చూసినవారు
వర్ధన్నపేటలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న బెంగుళూరు బేకరిలో బుధవారం ఖాదర్ అనే యువకుడు ఎగ్ పఫ్ తినగా, అందులో కుళ్లిపోయిన గుడ్డు ఉండడంతో వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తనతో ఉన్న స్నేహితుడు వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా బేకరిలో తినుబండారాలను అమ్ముతున్న సదరు యజమాని పై కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్