వరంగల్ పోలింగ్ విధులు, ఎన్నికలకు సంబంధించిన ఇతర విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. హన్మకొండ ఆర్డీఓ కార్యాలయంలో, ఎల్ బి కళాశాలలో పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది కొరకు ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు.