రాష్ట్రం నుంచి 30 లక్షల టన్నులు సేకరిస్తాం: కేంద్రం

61చూసినవారు
రాష్ట్రం నుంచి 30 లక్షల టన్నులు సేకరిస్తాం: కేంద్రం
తెలంగాణ నుంచి ఈ ఏడాది యాసంగి, వానాకాలం సీజన్లలో 30 లక్షల టన్నుల పారాబాయిల్డ్ బియ్యం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్రానికి సూచించింది. కేంద్రం నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కనీస మద్దతు ధర, రూ.500 బోనస్ ను చెల్లించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. రైతుల నుంచి వెంటనే వరిధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్