ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు INDIA కూటమికి బిగ్ షాక్ తగిలింది. లోక్సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ల సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరుపలేదని తెలిపారు. తాము బెంగాల్లో 42 ఎంపీ సీట్లలో ఒంటరిగానే బీజేపీని ఓడించగలమని ధీమా వ్యక్తం చేశారు.