ఏపీలో కొత్త మద్యం షాపులకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్

60చూసినవారు
ఏపీలో కొత్త మద్యం షాపులకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్
ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది. రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడిపేలా గత ప్రభుత్వం చట్టం చేసింది. వైసీపీ చేసిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపటిలోగా గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదం తెలియజేయనున్నారు. మొత్తం 3,736 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో 340 షాపులను కల్లు గీత కార్మికులకు రిజర్వ్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్