దేశంలో ఎవరైనా రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత దానిని ఎన్నికల కమిషన్లో నమోదు చేయడం తప్పనిసరి. రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి, ఎన్నికల సంఘం జారీ చేసిన దరఖాస్తు ఫారాన్ని ఆన్లైన్లో నింపాలి. ఆ ప్రింటౌట్తో పాటు ఇతర ముఖ్యమైన పత్రాలు జతచేసి, 30 రోజుల్లోగా ఎన్నికల కమిషన్కు పంపాలి. రిజిస్ట్రేషన్ కోసం రూ.10వేలు డిపాజిట్ చేయాలి. అలాగే కనీసం 500 మంది సభ్యుల మద్దతు ఉండాలి.