ప్రధాని నరేంద్ర మోదీకి
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నల వర్షం కురిపించారు. యువతకు ఏటా రెండు కోట్ల
ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన
మోదీ తన హామీని నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. మోదీతో దేశానికి మేలు జరుగుతుందని చెబుతున్న కాషాయ నేతలు భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, గోధుమల ధరల గురించి ఏమంటారని నిలదీశారు.
మోదీ హయాంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు.