2024లో ప్రఖ్యాత ‘షా’(‘నోబెల్ ఆఫ్ ద ఈస్ట్) పురస్కారానికి భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణి ఎంపికయ్యారు. ఈయన ఇన్ఫోసిస్ సంస్థ సహ వ్యవస్థాపకులు సుధామూర్తికి సోదరుడు. అమెరికాలోని పలోమెర్ ట్రాన్సియెంట్ ఫ్యాక్టరీ, జ్వకీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీల్లో టెలిస్కోప్ల సాయంతో రోదసీలోని నిర్దిష్ఠ ప్రాంతంలోని ఖగోళ అంశాలను పరిశీలించి, వాటిపై విశేష పరిశోధనలు చేసినందుకు ఈ అవార్డును ఈయనకు ప్రకటించారు.