ఆసియాలోని అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారవి గురించి చాలా మంది విన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 640 ఎకరాల ధారవి స్లమ్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టును
అదానీ గ్రూప్ కైవసం చేసుకుంది. 2000 సంవత్సరం నుంచి ధారవిలో నివాసం ఉంటున్న వారు మాత్రమే ఉచిత గృహ నిర్మాణానికి అర్హులు. ఈ సర్వే ఆధారంగా సుమారు 7 లక్షల మంది పునరావాస ప్రయోజనాలకు అర్హత కోల్పోయి రోడ్డున పడతారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.