మధ్యప్రదేశ్ గ్వాలియర్లో గురువారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. వివిధ నేరాలలో పాల్గొని, కోర్టు ఆదేశాలతో చైల్డ్ అబ్జర్వేషన్ హోమ్లో ఆశ్రయం పొందుతున్న ఆరుగురు చిన్నారులు పారిపోయారు. ఉద్యోగిని వేడి నీటి పాత్రలోకి వారు తోశారు. అనంతరం పరుగులు పెట్టి, గేటు వద్ద గోడ దూకి పరారయ్యారు. సంచలనాత్మక కేసుల్లో ప్రమేయం ఉన్న ఆ చిన్నారుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.