బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ (కేబీఈ)’ అవార్డును ఇటీవల భారతీయ టెలికాం రంగ దిగ్గజ పారిశ్రామిక వేత్త సునీల్ భారతి మిత్తల్కు ప్రదానం చేసింది. బ్రిటన్ రాజ సింహాసనాన్ని అధిరోహించిన ఛార్లెస్-3 నుంచి ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. బ్రిటన్, భారత్ వాణిజ్య సంబంధాల బలోపేతానికి చేసిన కృషికి యూకే ప్రభుత్వం ఈ పురస్కారంతో ఈయన్ను సత్కరించింది.