ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఓ తాగుబోతు ఫుల్గా మద్యం సేవించి మురుగు కాలువలోకి వెళ్లాడు. కాలువలో మురుగు నీటి ప్రవాహం నెట్టేయడంతో డ్రైనేజీ పైపులో ఇరుక్కుపోయాడు. రోడ్డు కింద మురుగు నీటి కోసం ఏర్పాటు చేసిన ఆ డ్రైనేజీ పైపు రెండు చివరలు తెరుచుకునే ఉన్నప్పటికీ.. తాగుబోతును బయటికి తీసేసరికి పోలీసులకు తలప్రాణం తోకకొచ్చింది.