HYD అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఈ విషయంలో MIMతో కలిసి పనిచేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. MGBS నుంచి ఫలక్నుమా వరకు 5.5 కి.మీ మేర మెట్రో ప్రాజెక్టు విస్తరణకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. "చంచల్గూడ జైలును అక్కడి నుంచి తరలించి, విద్యాసంస్థ ఏర్పాటు చేస్తాం. పాతబస్తీలో రోడ్ల విస్తరణకు రూ.200 కోట్లు కేటాయించాం. మూసీ నదిని 55 కి.మీ మేర సుందరీకరిస్తాం." అని పేర్కొన్నారు.