ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల రోడ్లు దెబ్బతింటున్నాయి. కొన్ని రోడ్లపై భారీగా బురద పేరుకుని పోతోంది. ఇదే కోవలో తాజాగా తమిళనాడులోని తిరునల్వేలి బరణి నగర్లో వర్షాలకు రోడ్లు అధ్వానంగా మారాయి. బురదతో కూడిన రోడ్డులో బైక్పై వెళ్తుండగా ఓ మహిళ జారి కింద పడింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. స్థానికులు వచ్చి ఆమెకు సపర్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.