భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ శుక్రవారం కుటుంబంతో కలిసి హోలీని చాలా సరదాగా జరుపుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో రోహిత్ తన భార్య, కూతురుతో కలిసి రంగులు పూసుకుని చిందులు వేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ గెలిచిన ఆనందం, మరో వారం రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం అయ్యే ఉత్సాహం రోహిత్లో కనిపిస్తోందని ఈ వీడియో చూసిన అభిమానులు అంటున్నారు.