రూ.2 కోట్ల ఆదాయంపై ఐటీఆర్ దాఖలు చేయలేదని సావిత్రి అనే మహిళలకు ఢిల్లీ కోర్టు ఆరు నెలల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. ఇన్కంట్యాక్స్ ఆఫీస్ నమోదు చేసిన ఓ ఫిర్యాదుపై కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. 2013-14 ఆర్థిక సంవత్సరం రూ.2 కోట్ల ఆదాయంపై రెండు లక్షల పన్ను వసూలు చేశామని, అయితే 2014-15 సంవత్సరానికి ఎటువంటి రిటర్న్స్ దాఖలు చేయలేదని ఇన్కంట్యాక్స్ ఆఫీస్ ఆరోపించింది.