యూపీలోని అలీగఢ్ లో దారుణం జరిగింది. శుక్రవారం కొందరు గ్రామస్తులు నయాబస్ కెనాల్ బ్రిడ్జి ట్రాక్ సమీపంలోని గోతిలో మహిళ(30) మృతదేహాన్ని చూశారు. సమాచారం అందుకున్న ఏఎస్పీ లిపి నగాయిచ్, లైట్ ఇంచార్జి గంగారాం గంగ్వార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొయ్యిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం గుర్తించలేని విధంగా ఛిద్రమైంది. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.