బాలీవుడ్ నటి, మండి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ ఇటీవల భారత తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని పేర్కొనడం విమర్శలకు దారితీసింది. వాటిపై ఆమె స్పందించారు. ‘నాకు జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నించిన వారంతా ఒక విషయం తెలుసుకోవాలి. నేను ఎమర్జెన్సీ చిత్రాన్ని డైరెక్ట్ చేశాను. నటించాను. కథ అందించాను. అది పూర్తిగా గాంధీ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. దయచేసి నాకు హితబోధలు చేయకండి’ అని కౌంటర్ ఇచ్చారు.