కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై కేరళ సీఎం తీవ్ర విమర్శలు

53చూసినవారు
కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై కేరళ సీఎం తీవ్ర విమర్శలు
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శలు గుప్పించారు. మత, హిందుత్వ రాజకీయాలను ఎదుర్కొవటంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమైందన్నారు. ‘సీపీఐ(ఎం) మేనిఫెస్టోలో దేశంలో విభజన సృష్టించే​ సీఏఏను రద్దు చేయాలనే ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో మాత్రం దానికి సంబంధించి ప్రస్తావన లేదు. సీఏఏ విషయంలో కాంగ్రెస్‌ మౌనం వహించింది’ అని సీఎం విజయన్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్