హర్యానాలో బస్సులో టిక్కెట్ కొన్న ఓ మహిళ.. కండక్టర్ చిల్లర తిరిగివ్వలేదని రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోలో.. తొలుత మహిళ టిక్కెట్టు కొన్నాక చిల్లర కోసం కండక్టర్తో గొడవకు దిగింది. అతడు ఏదో నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. పైఅధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు తన చేతిలో ఉన్న టిక్కెట్టును కూడా చించిపారేసింది.