ఆప్ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు రావాలని ఆదేశించింది. అయితే అధికారులు తన ఇంటికి వెళితే నోటీసులు తీసుకోవడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారని, అందుకే ఆయన ఇంటి గేటుకు నోటీసులు అంటించారని మహిళా కమిషన్ ట్వీట్ చేసింది.