సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం నిర్వహించనున్న రాష్ట్ర మహిళా సదస్సుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. వేసవి దృష్ట్యా సదస్సులో పాల్గొనే ప్రజాప్రతినిధులకు, మహిళలకు సరిపడా సీట్లు, తాగునీరు, సంచార శౌచాలయాలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. ప్రాంగణ సమీపంలో బస్సు పార్కింగ్, బారికేడింగ్, ప్రత్యేక క్యూ లైన్లు తదితర అంశాలపై శ్రద్ధ చూపాలన్నారు.