భువనగిరి మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి'

84చూసినవారు
సమస్యలు తెలుపుకోడానికి వచ్చిన తమపై దురుసుగా ప్రవర్తించిన భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సోమవారం పట్టణ ప్రజలు డిమాండ్ చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్న ప్రజల దరఖాస్తులు అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వం అందించే పథకాలు అందడం లేదని చల్లగురుగుల రఘుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పథకాలు అందని లబ్ధిదారులకు పథకాలు అందించే విధంగా అధికారులు పనిచేయాలన్నారు.

సంబంధిత పోస్ట్